ప్రజాశాంతి పార్టీకి గుర్తు కేటాయించలేదని కేఏపాల్ ఆవేదన

-

రాష్ట్రంలో ఆక్టివ్‌గా ఉన్నా తమ పార్టీకి సింబల్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ప్రశ్నించారు. తమ పార్టీకి గుర్తు కేటాయించకపోవడాన్ని అధికార పార్టీ కుట్రగా అభివర్ణించారు. రెండ్రోజుల్లో గుర్తు ఇవ్వకపోతే ప్రజలు ఓట్లు వేయొద్దని సూచించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసిన కేఏ పాల్‌.. తమ పార్టీకి గుర్తు కేటాయించాలని కోరారు.

మరోవైపు నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తికావడంతో గుర్తింపుపొందిన రాజకీయ పార్టీలకు గుర్తులజాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ విడుదల చేశారు. 32 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేనకి గ్లాస్‌టంబ్లర్, వైఎస్సార్ తెలంగాణపార్టీకి ఫుట్‌బాల్‌ గుర్తు కేటాయించారు. ఇటీవల ఆ పార్టీకి బైనాక్యులర్స్ గుర్తు కేటాయించగా ఆ పార్టీ అభ్యంతరం తెలపడంతో తాజాగా పుట్‌బాల్ గుర్తు కేటాయించారు.

యుగతులసి పార్టీకి రోడ్‌రోలర్, అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్ పార్టీకి చపాతిరోలర్ ఇచ్చారు. తెలంగాణ రిపబ్లికన్‌పార్టీకి మైక్, 10 స్థానాల్లో పోటీ చేసుకున్న సిపిఐ (ML‌)కి మూడుచుక్కలు కలిగిన జెండాగుర్తు కేటాయించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా- సీపీఐకి కంకికొడవలి, ఆలిండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌కు సింహం ఇచ్చారు. పలు గుర్తింపు పొందిన పార్టీల గుర్తుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది

Read more RELATED
Recommended to you

Exit mobile version