మోడీ సభకు 18 మంది సీఎంలు, జాతీయ నాయకులు వస్తారు – కిషన్‌ రెడ్డి

-

బీజేపీ కార్యవర్గ సమావేశాలకు 18 మంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు హాజరు కానున్నారని.. పండుగ వాతావరణంలో సభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల అవరోధాలు కల్పిస్తుందని ఫైర్‌ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని.. అనేక తప్పుడు విషయాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీ సభ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని… దేశంలో బీజేపీ ప్రవేశ పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతం అయ్యాయన్నారు.

సమావేశాల్లో భవిష్యత్ పరిపాలన పై చర్చించుకుంటున్నామని.. 15 ప్రత్యేక ట్రైన్లు, వందలాది బస్సులు ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని వెల్లడించారు. కార్యకర్తలు, ప్రజల నుంచి విరాళాలు సేకరించి సభ లో పాల్గొంటానని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టిఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు, కుట్రలు చేసిన ప్రజల అండ బీజేపీకి ఉంటుందని స్పష్టం చేశారు. 15 ప్రత్యేక ట్రైన్లు, వందలాది బస్సులల్లో మోడీ సభకు వస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news