N-కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే.. కేటీఆర్ సమంతను పంపాలన్నాడు : మంత్రి కొండా సురేఖ

-

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖ పై ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఈ ట్రోలింగ్స్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించలేదని కొండా సురేఖ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై  కేటీఆర్ దొంగ ఏడుపులు ఎందుకు..? పెడబొబ్బలు దేనికి?  అని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. 

తాజాగా మీడియాతో మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి 100 శాతం కేటీఆరే కారణం అని తెలిపారు. N-కన్వెన్షన్ హాల్ ను కూల్చకుండా ఉండాలంటే సమంతను నా దగ్గరికి పంపాలని కేటీఆర్ అడిగాడు. ఇందుకు సమంతను కేటీఆర్ వద్దకు పంపించేందుకు నాగార్జున ఒత్తిడి చేశారని.. సమంత నేను వెళ్లనంటూ నిరాకరించింది. దీంతో తాము చెప్పింది విను..లేకపోతే వెళ్లిపోమని చెప్పి సమంతకు విడాకులు ఇచ్చారని మంత్రి కొండా సురేఖ ఆరోపించింది. కేటీఆర్ కారణంగానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరగా పెళ్లి చేసుకుందని.. మరో ఇద్దరూ హీరోయిన్లు కూడా త్వరగానే పెళ్లి చేసుకున్నారని తెలిపింది కొండా సురేఖ. కేటీఆర్ డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా.. హీరోయిన్లకు కూడా డ్రగ్స్ అలవాటు చేశాడని.. ఫోన్ ట్యాపింగ్ తో హీరోయిన్ల జీవితాలను నాశనం చేశాడని ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version