బిజెపిని గెలిపించేందుకే మా వాళ్ళని అటు పంపించాం – ఎమ్మెల్యే రఘునందన్ రావు

-

మునుగోడులో బిజెపిని గెలిపించుకునేందుకే మా వాళ్లని ఆ పార్టీలోకి పంపించామని అన్నారు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు. కండువాలు కప్పి పక్కన కూర్చోబెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళు కాదని అన్నారు. మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ ఇంట్లో లైట్ వేస్తే పెరట్లో లైట్ వెలిగినట్లు.. ఎవరినో హైదరాబాదులో కొనుగోలు చేసి అంతా అయిపోయిందని భావిస్తే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని అన్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితమే మునుగోడు లో కూడా రాబోతోందని చెప్పారు. లిక్కర్ స్కాం లో ఇరుక్కుపోయిన కల్వకుంట్ల కవిత కోసం మునుగోడు సీటును వదులుకున్నారని ప్రచారం జరుగుతోందని రఘునందన్ రావు ఆరోపించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేతలు, పెద్దలతో రహస్యమంతనాలు జరిపారని.. కాంగ్రెస్ ప్రచారం కోసం తాను పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని, మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ భారీగా ఖర్చు చేయాలని సీఎం కేసిఆర్ కోరినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news