ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ని కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల

-

మునుగోడు ఉప ఎన్నికలలో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనకి ఈ అవకాశం ఇచ్చి, తన విజయానికి కారణమైనందుకు మునుగోడు ఎమ్మెల్యే పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ఆయనని శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా మునుగోడు అభ్యర్థి విజయం కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను సీఎం కేసీఆర్ అభినందించారు. పార్టీ మీద, నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని అన్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యచరణలో పెట్టేందుకు పూనుకోవాలని సూచించారు. అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news