రాష్ట్రంలో కక్షపూరితమైన రాజకీయం నడుస్తుంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

రాష్ట్రంలో కక్షపూరిత మైన రాజకీయం నడుస్తుంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.ప్రతిపక్ష పార్టీ లు, ప్రజా సంఘాలు, సోషల్ మీడియా పై నిర్బంధమ్ పెరిగి పోయింది అన్నారు.ఎమ్మెల్యే లు, మంత్రుల వేధింపులు విపరీతంగా పెరిగాయని,రైస్, లిక్కర్, మైన్స్, సాండ్, ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా సాగుతోంది అని అన్నారు.మళ్ళీ గెలుస్తామో లేదో.. ఉన్నప్పుడు దోచుకుందామని trs ఎమ్మెల్యే లు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.ఖమ్మం బీజేపీ కార్యకర్త పై 16 కేసులు పెట్టారు… మూడు సార్లు జైల్ కి పంపించారు…

పోలీసుల వేధింపులు నిత్య కృత్యం అయ్యాయి అని ఫైర్ అయ్యారు.నాలుగో తేదీ తన పెళ్లి ఉందని… పెళ్లి పనులు చేసుకుంటున్నానని చెప్పిన పోలీసులు వినలేదని,ఆయన పోలీస్ స్టేషన్ ముందు విషం తీసుకున్నారు..తన ఆత్మహత్య కు కారణం ఏందో మీడియా ముందు తెలిపారు…అయిన కేసు నమోదు చేయలేదు అని ఫైర్ అయ్యారు.ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ పై కేసు పెట్టారు… కానీ కారణం అయిన వారి పై కేసు ఎందుకు పెట్టలేదు అని అన్నారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news