డైనమిక్ సిటీ హైదరాబాద్ లో అడుగుపెట్టా – ప్రధాని మోడీ ట్వీట్

-

హైదరాబాద్ : కాసేపటికి క్రితమే బేగంపేటకు చేరుకున్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఈ మేరకు ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. తాను కాసేపటికి క్రితమే డైనమిక్ సిటీ అయిన హైదరాబాద్ లో అడుగు పెట్టాను. డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నానని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తామన్నారు నరేంద్ర మోడీ. కాగా…

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు  బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న.. ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అలాగే బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రధానికి ఘనస్వాగతం పలికింది. అనంతరం బేగంపేట నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో నోవాటెల్ హోటల్ కు వెళ్లారు ప్రధాని.

 

 

Read more RELATED
Recommended to you

Latest news