సిరిసిల్లలో వర్ష బీభత్సం..మునిగిపోయిన కాలనీలు

-

సిరిసిల్లలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. దీంతో నీట మునిగిపోయాయి కాలనీలు. సిరిసిల్ల పట్టణంలో నిన్నటి సాయంత్రం నుంచి నిర్విరామంగా కురుస్తున్న వర్షం, గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి ఇప్పటికే పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు శాంతినగర్, శ్రీనగర్, వెంకంపేట, పద్మ నగర్, బి వై నగర్ లు జలమయం అయ్యాయి.

భారీ వర్ష సూచనలతో అధికార యంత్రాంగం మరియు పోలీసులు, అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే నదులు, చెరువులు, కుంటల వద్ద ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీసులు, వెళ్లే దారులను నిర్బంధించారు. కలెక్టర్ మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజల అవసరార్థం కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version