ఒవైసీ.. దమ్ముంటే నాపై పోటీ చెయ్: రాజాసింగ్

-

ఒవైసీ.. దమ్ముంటే నాపై పోటీ చెయ్ అంటూ బిజేపి పార్టీ ఎమ్యెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. AIMIM అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దమ్ముంటే గోషామహల్ లో తనపై పోటీ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తనపై పోటీ చేయాలని ఓవైసీ చాలెంజ్ చేయడానికి ప్రస్తావిస్తూ… కాంగ్రెస్ పార్టీ ఎమ్ఐఎమ్ ని పాముకి పాలు పోసి పెంచినట్లు అయిందని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. ఓవైసీ సోదరుల్లో ఎవరు తనపై పోటీ చేసిన చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు.

అటు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో కేరళ వయనాడ్‌లో కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని రాహుల్‌ గాంధీకి ఒవైసీ సవాల్‌ విసిరారు. 1992వ సంవత్సరంలో పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీ మసీదు కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీని వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయమని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీ మసీదును కూల్చివేశారని అసదుద్దీన్ పునరుద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version