తెలంగాణ పేరును..బీహార్ గా మార్చేస్తున్నారు : రేవంత్ సంచలనం

-

తెలంగాణ పేరును..బీహార్ గా మార్చేస్తున్నారని కేసీఆర్ సర్కార్ పై కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎస్ లలో అంజనీ కుమార్ ఏపీకి కేటాయించారని.. కానీ తెలంగాణ లోనే ఉన్నాడని ఫైర్ అయ్యారు. డీజీపీని లీవ్ లో పంపి.. బీహార్ కి చెందిన అంజనీ కుమార్ కి డీజీపీ పోస్ట్ ఇచ్చాడని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం మొత్తం బిహారీల మీద బలాత్కారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వ్యహా కర్త ప్రశాంత్ కిశోర్ కూడా బీహార్ వ్యక్తి అని.. తెలంగాణ పదం మాయమై… బీహర్ గా మార్చేస్తున్నారని అగ్రహించారు.

సాగునీటి పారుదల శాఖ అధికారి రజత్ కుమార్, మున్సిపల్ శాఖ అధికారి అరవింద్ కుమార్, కేటీఆర్ ఆత్మ జయేష్ రంజన్ అని, సందీప్ కుమార్ సుల్తానియా ఈయన దగ్గర ఎనిమిది శాఖలు ఉన్నాయని… వీరంతా బీహార్ చెందిన వారే అని.. బీహార్ అధికారులను కేసీఆర్ కోటరీగా పెట్టుకున్నారని విమర్శించారు. వీరంతా ముఠాగా ఏర్పడి తెలంగాణ పరిపాలనను గుప్పిట పెట్టుకుని, కేసీఆర్ దోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news