కాంగ్రెస్ వేవ్ ను ఆపడం ఎవరి తరం కాదు : రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ వేవ్ ను ఆపడం ఎవరి తరం కాదు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా.. అని పేర్కొన్నారు. భయం తో ఉచిత సిలిండర్లు ,సన్న బియ్యం రేషన్ , రైతు లకు పెన్షన్ లాంటి హామీ లు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు.బీఆర్ఎస్ పనైపోయింది ,ప్రభుత్వం లో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరు అన్నారు. టిక్కెట్ ల ప్రకటన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాతే ఉంటుంది.

టిక్కెట్ ల ప్రకటన నాటికి చాలా మంది బీజేపీ, బీఆర్ఎస్ నేతల చేరిక ఉంటుంది.బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ లు మా పార్టీ లోకి వస్తున్నారంటేనే మా బలం ఏంటో  స్పష్టంగా అర్దం అవుతుంది. బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటే ఛాన్స్ లేదు.. రాష్ట్రంలో 19% ఓట్లు అన్ డిసైడ్ లో ఉన్నాయి..ఇందులో మెజారిటీ ఓటు షేర్ మాకే వస్తుంది అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version