రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావాలి – కొండా విశ్వేశ్వర్ రెడ్డి

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని మరోసారి బిజెపిలోకి ఆహ్వానించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొనే సత్తా ఒక్క బీజేపీకే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని మిగతా నేతలు కూడా ఆలోచన చేయాలని సూచించారు. బిజెపి అంటే సెక్యులర్ పార్టీ అని వ్యాఖ్యానించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి ని కూడా బిజెపిలో చేరాలని కోరామన్నారు.

తాను బిజెపిని వీడి ఎక్కడికి వెళ్లడం లేదని.. బిజెపి పై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. ఇతర పార్టీలలోనే కన్ఫ్యూజన్ ఉందన్నారు కొండా. కాంగ్రెస్ పార్టీయే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పార్టీ అన్నారు. ఇక బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడు అరెస్ట్ అనేది మా చేతిలో లేదని.. ఒక రాజకీయ పార్టీ ఎవరిని అరెస్టు చేయలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version