రేవంత్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలు.. తాటి కొండ రాజయ్య

-

రేవంత్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలు అని మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ నేత తాటి కొండ రాజయ్య పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అందరిని మోసం చేస్తున్నట్లు మాదిగలను మోసం చేయాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీలో సభ్యుల మెప్పు పొందేందుకు అన్ని రాష్ట్రాల కంటే ముందే ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

తాను జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం కావడానికి  మాదిగలు కారణం అని రేవంత్ రెడ్డి చెప్పారు. మూడు ఎస్సీ ఎంపీ స్థానాల్లో రెండు మాలలు, ఒకటి బైండ్లకు ఇచ్చారు. మంత్రి పదవుల్లో ఒకటి మాల,  మరొకటి మోచీకి ఇచ్చారు. ఇదెక్కడి సామాజిక న్యాయమో అర్ధం కావడం లేదు. “కేసీఆర్ నాకు తొలి డిప్యూటీ సీఎంగా పనిచేసే అవకాశం ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణపై నా చేత అసెంబ్లీలో కేసీఆర్ తీర్మానం పెట్టించారు” అని గుర్తు చేశారు.  ఉప సంఘం పేరుతో కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ  మొదటి నుంచి మాలలకు అనుకూలంగా పని చేస్తోందని తెలిపారు తాటికొండ రాజయ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version