ఎస్సీ,ఎస్టీలకు క్రిమిలేయర్ వద్దు.. ప్రధానికి బీజేపీ ఎంపీల మెమొరండం..!

-

ఎస్సీ, ఎస్టీలకు క్రిమిలేయర్ ను అమలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీకి చెందిన తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ.. ఎస్సీ, ఎస్టీలకు క్రిమిలేయర్ పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో శుక్రవారం పార్లమెంట్ హౌస్ లో సుమారు 100 మంది బీజేపీకి చెందిన లోక్ సభ, రాజ్యసభకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ప్రధానిని కలిసి తమ సామాజిక వర్గాలకు క్రిమిలేయర్ పద్దతిని మెమొరండం అందజేశారు.

తమ విజ్ఞప్తి పై ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు ఈ సమావేశం అనంతరం ఎంపీలు మీడియాకు వెల్లడించారు. ఎంపీల సమావేశానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ సైతం తన వ్యక్తి గత ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ ఎంపీల డెలిగేషన్ సమావేశం అయిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారిత కోసం నిబద్దతతో ఉన్నామని పునరుద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version