BREAKING : మునుగోడు BSP అభ్యర్థిగా శంకరా చారి

-

మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రిలీజ్‌ కాగానే.. అన్ని పార్టీలు తమ తమ పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. బీఎస్పీ పార్టీ తెలంగాణ అధినేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కూడా…తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు.

మునుగోడు బీఎస్పీ అభ్యర్థి గా శంకరా చారిని ఫైనల్‌ చేశారు. ఈ మేరకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అధికారిక ప్రకటన చేశారు.కాగా, మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ ను ఈసీ విడుదల చేసింది. దీంతో నిన్నటి నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 17 వరకు నామినేషన్లు పరిశీలించనున్నారు. అక్టోబర్ 17 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news