సీఎం కేసీఆర్ ది నరం లేని నాలుక.. ఆయన ఊసరవెల్లి : వైయస్ షర్మిల

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట చంద్రశేఖరరావు ది నరం లేని నాలుక అని… ఆయన ఉసరవెల్లి అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏండ్లుగా పోడు రైతులు కన్నీళ్లు పెడుతున్నరు.భూమిని, రైతును వేరుచేస్తే.. తల్లిని,బిడ్డను వేరు చేసినట్టేనని నిప్పులు చెరిగారు.‘ఈ భూమి మాది’అని చెప్పుకునే హక్కు కూడా లేకుండా చేశారు.పోడు రైతులపై దాడులు చేసి, జైలులో పెడుతున్నరు.ఇది ప్రజాస్వామ్యమా? రౌడీయిజమా? ఆని నిలదీశారు.

 

రైతులకు 5వేలు ఇచ్చి 25 వేల పథకాలు బంద్ పెట్టిండు. వడ్లపై ఊసరవెళ్లి రాజకీయాలు చేసిండనీ ఫైర్ అయ్యారు. KCRది నరం లేని నాలుక.చెప్పేవన్నీ అబద్దాలె.ప్రజలను పాలకపక్షం గాలికొదిలేస్తే,ప్రతిపక్షాలు వెన్నుపోటు పొడిచాయి.అందుకే ప్రజలపక్షాన YSR తెలంగాణ పార్టీని స్థాపించాంమని స్పష్టం చేశారు వైయస్ షర్మిల.సమస్యలు ఎత్తిచూపడానికే మండుటెండలోనూ పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news