సీఎం కేసీఆర్‌ బాత్రూంకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు : షర్మిల సంచలనం

-

సీఎం కేసీఆర్‌ బాత్రూంకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లపై తాజాగా వైఎస్‌ షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు ఎలలా బ్రతకాలి… ఇంత శ్రమ చేసి రైతుకు ఎం మిగులుతాదని… 65లక్షల వడ్లు టన్నుల కొనాలి అని ప్రభుత్వం అంచనా అన్నారు.


కానీ ఇంత వరకు కేవలం 6.5 లక్షలు కోన్నరు .. అంటే 10% మాత్రమే కొన్నారు.. అంటే ఒక్క నెల రోజుల్లో 10% కొంటే మిగతాది ఎప్పుడు కొంటారని ప్రశ్నించారు. రైతులు ఎన్ని రోజులు ఇళ్లకు దూరంగా, మార్కెట్ యార్డ్ లి ఉండాలా? అని నిలదీశారు.

పట్ట పగలు రైతు లు దోపిడీకి గురవుతున్నారని… రైతు బంధు కింద 5వెలు ఇస్తున్నారు… మద్దతు ధర ఇవ్వండని డిమాండ్‌ చేశారు. మద్దతు ధర ఇస్తే రైతు లు, కౌలు రైతులు అందరూ బాగుపడతారని.. వైఎస్ఆర్ హయాంలో ఉన్న అన్ని పథకాలను బంధు పెట్టి రైతు బంధు ఒక్క పథకాన్ని ఇస్తున్నారన్నారు. రైతు చనిపోతే కూడా భీమా రాదు. . ఒక వేళ వచ్చినా 60ఏళ్ల లోపు ఉండాలని.. మీరు మాత్రం గడిలలో ఉండొచ్చు. బాత్రూం కి కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉండొచ్చని చురకలు అంటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news