తెలంగాణ ప్రజలకు అలర్ట్‌.. ఇవాళ్టి నుంచి భారీగా పెరగనున్న ఎండలు

-

తెలంగాణ ప్రజలకు అలర్ట్‌.. ఇవాళ్టి నుంచి ఎండలు భారీ పెరగనున్నాయి.  మొన్నటి వరకు తెలంగాణ వ్యాప్తంగా కాస్త చల్లటి వాతావరణం కనిపించింది. కానీ సోమవారం మాత్రం ఎండను, ఉక్కపోతను తట్టుకోలేని పరిస్థితి కనిపించింది. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ సోమవారం నుండి వాతావరణ మారిపోయింది. ఎండ తీవ్రత పెరిగింది.

ఆదివారం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇప్పుడు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. బుధవారం నుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణ ఏర్పడే అవకాశం ఉందని, మంగళవారం నుండి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాలలో 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news