బోనాలకు సహకరించిన అన్ని విభాగాలకు ధన్యవాదాలు: మంత్రి తలసాని

-

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా సాగుతోంది. బోనాల పండుగలో భాగంగా ఇవాళ రంగం కార్యక్రమం జరిగింది. జోగిని స్వర్ణలత తెలంగాణ ప్రజల భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. రంగం అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. కాసేపట్లో పోతరాజు విన్యాసాలు ఉంటాయని.. ఆ తర్వాత ఘటోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. బోనాలకు సహకరించిన అన్ని విభాగాలకు ధన్యవాదాలు చెప్పారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఫలహారం బండ్ల ఊరేగింపు ఉంటుందని వివరించారు.

ఈ బోనాల సంబురాల్లో అమ్మవారిని లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మంత్రి తలసాని చెప్పారు. ఆదివారం రాత్రంతా దర్శనాలు జరిగాయని తెలిపారు. ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇతర మంత్రులు.. వివిధ పార్టీల నేతలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారని వెల్లడించారు. రంగంలో భాగంగా.. అమ్మవారు భవిష్యవాణిలో బోనాలు కార్యక్రమం బాగా జరిగిందని చెప్పడం సంతోషకరమని తలసాని హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version