BREAKING : నేడు ఢిల్లీ వెళ్ల‌నున్న తెలంగాణ సీఎం కేసీఆర్..రోడ్డు మార్గానే పయనం ?

-

BREAKING : ఢిల్లీకి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్..పయనం కానున్నారని సమాచారం అందుతోంది. రేపు రామగుండం కు ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో.. ఇవాళ రాత్రే ఢిల్లీకి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్.. పయనం కానున్నారని సమాచారం అందుతోంది.

అయితే.. ఇవాళ ఢిల్లికి వెళ్లనున్న సీఎం కేసీఆర్ గారు.. దాదాపు నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పలువురు నేతలను కలువనున్నారని టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు… ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రోడ్డు మార్గానే తిరుగు ప్రయాణం కావాలని నిర్ణయం తీసుకున్నారట. అలాగే పలు రాష్ట్రాల్లో రోడ్‌ షోలు, స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ.. టీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news