నేడు టిఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య అంత్యక్రియలు

-

టిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లా తెల్దార్ పల్లి లో 144 సెక్షన్ విధించారు. ఎటువంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరించారు. తమ్మినేని కృష్ణయ్య ను నిన్న ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసి బైక్ పై వెళ్తున్న కృష్ణయ్యను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారు దుండగులు. దీంతో అక్కడికక్కడే చనిపోయారు కృష్ణయ్య. ఈ హత్యలో ఐదుగురు పాల్గొన్నట్లు సమాచారం. బైక్ పై కృష్ణయ్య వెనక కూర్చోగా ముందు డ్రైవింగ్ చేస్తున్నాడు ఆయన డ్రైవర్ ముతెష్. ముతేష్ ను బెదిరించి అక్కడి నుండి పంపేశారు దుండగులు. ఆ తర్వాత ఆయనపై ఏకధాటిగా కత్తులతో దాడి చేశారు. కృష్ణయ్య హత్య నేపథ్యంలో స్థానికంగా ఉద్రుక్త పరిస్థితులు నెలకొన్నాయి.నేడు కృష్ణయ్య అంతిమయాత్రలో పాల్గొననున్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రవతి.

Read more RELATED
Recommended to you

Latest news