పశువులను మేపడానికి వెళ్లిన మహిళపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం

-

ప్రస్తుత సమాజంలో రోజు రోజుకి కామాంధుల ఆగడాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రదేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలు, అమ్మాయిలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. అయితే కొంత మంది వాటిని ధైర్యంతో ముందుకు వచ్చి చేప్పుకోగా, కొంతమంది మాత్రం చెప్పుకుంటే నలుగురిలో పరువు పోతుంది అని లోలోపల కుమిలిపోతున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని ఓ గ్రామానికి చెందిన వివాహిత గత గురువారం పశువులను మేపేందుకు శివారులోని అడవి ప్రాంతం లోకి వెళ్ళింది. అదే గ్రామానికి చెందిన బస్సి రాజేందర్,బస్సి రెడ్యాలు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వాగు సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని కుటుంబీకులు గురువారం రాత్రి ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం నిందితుల ఇళ్లకు వెళ్లగా వారు లేకపోవడంతో కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news