తెలంగాణ సక్కగా లేదు కానీ… ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారు: వైఎస్ షర్మిళ

-

తెలంగాణ సక్కగా లేదు కానీ… పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారని కేటీఆర్ ను వైఎస్సార్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిళ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని మీరు దేశాలను ఏలబోతున్నారంటూ ప్రశ్నించారు. ఇక్కడ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ముందు వీరికి సమాధానం చెప్పాలని అన్నారు. ఏం పొడుద్దాం అని, ఏం పీకుదామని దేశాన్ని ఏలబోతున్నారంటూ ఘాటుగా విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ కు తెలంగాణ ప్రెండ్స్ లేరని.. ఒక వేళ తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ ప్రజల సమస్యలు తెలిసేవని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే రైతుల గోసలు, ఉాపాధి హామీ పనికి పనిచేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదని అర్థం అయ్యేది అంటూ విమర్శించారు. చిన్న దొరకు ఆంధ్ర వాళ్లే ఫ్రెండ్స్ అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news