జగ్గారెడ్డి సమైక్యవాది అయితే ఏపీకి పోయి బతకాలి: బాల్క సుమన్

-

నేను హత్య చేశానని జగ్గారెడ్డి అంటున్నాడని.. ఆనాడు కాంగ్రెస్ పాలనలో విప్ గా ఉన్నావు కదా… ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఉద్యమ పార్టీకి ద్రోహం చేసిన చరిత్ర నీదని.. సమైక్యవాది అని జగ్గారెడ్డి చెప్పుకుంటున్నాడని ఏపీకి పోయి బతకాలని అన్నారు. రేవంత్ రెడ్డి మెచ్చుకుంటాడని మాట్లాడుతున్నాడని విమర్శించారు. నీ కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్యవాదమా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడని.. జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారని… కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్యవాదమే అని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ ఎందుకు రావాలి అని ప్రశ్నించారు. ప్రశాంత వాతావరణంలో చిచ్చు పెట్టి, విద్వేశాలను రెచ్చగొట్టడానికి రాహుల్ గాంధీ వస్తున్నారని దుయ్యబట్టారు. ఒకప్పుడు యూనివర్సిటీ ఉద్యమ కేంద్రంగా ఉందని… ఇప్పుడు ఓయూ ప్రశాంతంగా ఉందని ఆయన అన్నారు. రాజకీయ స్వార్థం కోసం విద్యార్థులను జీవితాలను నాశనం చేయవద్దని బాల్క సుమన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news