మంచు లక్ష్మి: నేను రండే అంటే వచ్చే హీరోయిన్స్ ఉన్నారు.! కానీ.!

-

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కు తెలుగు ప్రజల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే కొన్ని సినిమాలు, టాక్ షో లతో మెరిసిన లక్ష్మీ ప్రస్తుతం ఆమె ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో “ఆహా భోజనంబూ” అనే కుకింగ్ షో చేస్తున్నారు. ఈ షోలోకి తెలుగు సినిమా సెలబ్రిటీ లను తీసుకొని వచ్చి వారితో వంటలు చెపిస్తూ వారి గురించి వివరాలు తెలుసుకుంటూ ఉంటారు..ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచులక్ష్మీ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఈ ఇంటర్వ్యూ లో ఇప్పటి టాక్ షో గురించి, గతంలో జరిగిన టాక్ షో అనుభవాలు గురించి చెప్పుకొచ్చింది. తెలుగు హీరోయిన్స్ అందరూ నాతో చాలా ఉంటారని చెప్పుకొచ్చింది.అలాగే హీరోస్లో కూడా చాలా మంది ఫోన్ చేస్తే చాలు వెంటనే వచ్చేస్తారు ఇక రకుల్ ప్రీత్ సింగ్ మరియు తాప్సీ లను ఏయ్ రండే అని కాల్ చేసినా చాలు వెంటనే నా దగ్గర వాలి పోతారు. అలాగే రానా దగ్గుపాటి కూడా నేనంటే చాలా ఇష్టం. వాళ్లకు నా మీద చాలా ప్రేమ.

కాని ఒకసారి అనుష్క విషయంలో భయం వేసింది.. “ఓసారి అనుష్క శెట్టిని నా షోకు రమ్మని పిలిచాము. తను కూడా వస్తా అని చెప్పింది. ఆ తర్వాత రెండు రోజులు ఫోన్ ఎత్తలేదు . తను భాగమతి ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయినా కూడా నాలో ఎక్కడో రాదని భయం వేసింది. తనతో షో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అలా ప్లాన్ చేశాను.కాని రెండు రోజుల తర్వాత తానే కాల్ చేసి వస్తా అని చెప్పానుగా అంటూ నాలో ఉన్న కంగారును పోగొట్టింది అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news