మహబూబ్‌నగర్‌లో తండ్రిని కడతేర్చిన కొడుకు..

-

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తండ్రిని కొన్నకొడుకే హతమార్చిన ఉదంతం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాకు చెందిన రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామానికి చెందిన కావలి నారాయణ అనే వ్యక్తిని అతని కొడుకు కావలి నందు గురువారం అర్దరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి హత్య చేసినట్లు తెలుస్తోంది.

అయితే, నందుకు గత కొంతకాలంగా మతిస్థిమితం లేదని, ఏ పని చేయకుండా గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతుండేవాడని స్థానికులు పేర్కొన్నారు. ప్రతిరోజూ రాత్రి వారి ఇంటి తలుపులకు గొళ్లెం పెట్టి ఉండేదని, నిన్న రాత్రి మాత్రం తలుపులు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో నారాయణ పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version