నేడు ఖమ్మంకు రేవంత్‌ రెడ్డి..

-

టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. అయితే మే 6వ తేదీన వరంగల్ జిల్లాలో రైతు సంఘర్షణ సభ కార్యక్రమం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సభకు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ హాజరువుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుంతుందని కాంగ్రెస్‌ శ్రేణులు తెలిపాయి.ఈ సమావేశంలో భాగంగా జనసమీకరణ, సన్నాహక కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో చర్చ జరుగుతుందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

Congress cadres upbeat after Dalit Dandora

అనాది నుండి కాంగ్రెస్ పేదల పక్షాన పోరాటం చేస్తుందని అందులో భాగంగానే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్ సమావేశం నిర్వహించనున్నట్టు, నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రైతులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం రాహుల్ గాంధీ నడుం బిగించారని కాంగ్రెస్‌ నేతలు అన్నారు. తెలంగాణ ప్రజలను దోపిడీల నుండి విముక్తి చేయడానికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇస్తే నేడు సొంత రాస్ట్రంలో జరుగుతున్న దోపిడీలను ఎండగట్టేందుకు ఈ సభను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news