శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ..!

-

ఇటీవలే కరోనా వైరస్ ప్రభావం కారణంగా పూర్తిగా భక్తులకు దర్శనం నిలిపివేసిన టీటీడీ బోర్డు… క్రమక్రమంగా భక్తులకు దర్శనానికి అనుమతులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే భక్తులందరికీ సాధారణ దర్శనానికి అవకాశం కల్పించింది. రానున్న రోజుల్లో భక్తులకు సాధారణ దర్శనం టోకెన్ ల సంఖ్యను మరింత పెంచుతామని టిటిడి బోర్డు తెలిపింది. ఇక ఇప్పుడు మరోసారి శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ బోర్డు.

టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని భక్తులకు కల్పించేందుకు సిద్ధమైంది. 300 రూపాయల టిక్కెట్లు తమ వెబ్సైట్ లో విడుదల చేసేందుకు టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 19 వేల టిక్కెట్లు అందరికీ అందుబాటులో ఉంటాయని టీటీడీ బోర్డు ప్రకటించింది. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు స్లాట్లు భక్తులందరూ బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయని… భక్తులందరూ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటు తెలిపింది. మరికొన్ని రోజుల్లో అదనంగా మరో మూడు వేల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది టిటిడి బోర్డు .

Read more RELATED
Recommended to you

Latest news