యూపీలో దారుణం… పెళ్లి పేరుతో మహిళ, ఆమె కూతుళ్ల పై గ్యాంగ్ రేప్

-

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళ, ఆమె మైనర్ కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు తండ్రి, కొడుకుతో పాటు అతని స్నేహితులు. ఈ ఘటన యూపీలోని కనౌజ్ జిల్లా జరిగింది. సదర్ కొత్వాలీకి చెందిన ఓ బాధిత మహిళ మూడేళ్ల క్రితం భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సదరు మహిళకు వివాహం చేయాలని బంధువులు భావించారు. మావైయా గ్రామానికి చెందిన అమిత్ అలియాస్ నహర్ సింగ్ మాట్లాడారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటాడనే నమ్మడంతో సదరు మహిళ, తన ఇద్దరు కూతుళ్లతో నిందితుడి ఇంటికి వెళ్లేది.

అత్యాచారం
అత్యాచారం

నిందితుడు అమిత్ తో బాధిత మహిళ శారీరక సంబంధం ఏర్పరుచుకుంది. ఈక్రమంలోనే నిందితుడు నోయిడాలోని తన ఇంటికి తీసుకెళ్లి..తండ్రి రామ్​ సింగ్​, స్నేహితులు దిలీప్​, పవ్​నేష్​ బాధిత మహిళతో పాటు ఆమె కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు మహిళ, ఆమె కూతురు వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించారని… తన 15 ఏళ్ల కూతురును చిత్ర హింసల పాలుచేశారని..వ్యభిచారం చేయాలంటూ ఒత్తడి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పొలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news