బోండా ఉమాకు వాసిరెడ్డి పద్మ కౌంటర్.. కాలకేయుడు అంటూ..

-

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ.. బోండా ఉమాకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆమె విజయవాడలో మాట్లాడుతూ.. బోండా ఉమా ఆకు రౌడీ కూడా కాదు చిల్లర రౌడీ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుడి రూపంలో ఉన్న కాలకేయుడు అంటూ ఆమె విమర్శించారు.

Vijayawada: Women's panel chief Vasireddy Padma assures all help to women

బోండా ఉమా రాజకీయంలో చంద్రబాబు పావు అయ్యాడని, నేను నా పై జరిగిన వ్యక్తిగత దాడిగా నేను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మహిళా కమిషన్ పై దాడిగానే నేను తీసుకున్నానని, మహిళా నాయకులు, బాధితుల పై ఎలా వ్యవహరించాలో క్లాస్ తీసుకుందాం అనుకున్నా అన్నారు. హైకోర్టులో ప్రైవేటు కేసు వేయలేనా.. నా పదవి ఊడగొడితే ఉత్తమ మహిళా నాయకురాలిగా చంద్రబాబు గుర్తిస్తాను అన్నాడా..చీర కట్టుకుని వెళ్ళమని చెప్పారా అని ఆమె బోండా ఉమాపై ప్రశ్నలు కురిపించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news