వివాహం అనంతరం మొదటి సారి పోస్ట్ షేర్ చేసిన విఘ్నేష్..!!

-

ప్రముఖ లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార.. కోలీవుడ్ స్టార్ దర్శకుడు విఘ్నేష్ శివన్ నేడు ఉదయం మహాబలిపురంలో ఉన్న షెరటాన్ గ్రాండ్ హోటల్ లో చాలా అంగరంగవైభవంగా వీరి వివాహం జరిగింది . ఇక వీరి వివాహ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. ఇకపోతే సుమారుగా ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకుంటున్న వీరు ఎవరికీ తెలియకుండా 2021లో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత వీరికి ఎంగేజ్మెంట్ అయినట్లు తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేసినా ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అని చెప్పవచ్చు.

ఎట్టకేలకు ఇద్దరి తో ప్రేమాయణం నడిపి బ్రేకప్ మూటగట్టుకున్న నయనతార చివరికి దర్శకుడు విఘ్నేష్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరి వివాహానికి సంబంధించిన వేడుకను పూర్తిగా చూడాలి అంటే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లెక్స్ లో చూడవచ్చు అని అందుకోసం ఏకంగా 2.5 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇలా ఉండగా వీరి వివాహ వేడుకను రెండు భాగాలుగా విడదీసి ప్రసారం చేయబోతున్నారు. ఇక వివాహం జరిగిపోయింది కాబట్టి ఏకంగా లక్ష మందికి ఉచితంగా అనాథలకు అన్నదానం కూడా చేపడుతున్నారు . వారి ఆశీర్వాదం కూడా పొందడానికి మీరు ఇలా చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా వివాహం తర్వాత మొదటి సారి విఘ్నేష్ శివన్ తన భార్య నయనతార గురించి గొప్పగా వర్ణిస్తూ ఒక ఫోటో తో పోస్ట్ షేర్ చేశాడు. అంతే కాదు వివాహం జరిగిన సమయంలో పెళ్లి పీటల మీద తన భార్య ను ప్రేమగా ముద్దాడుతూ ఉన్న ఒక ఫోటోను కూడా షేర్ చేసి.. ఇలాంటి గొప్ప వ్యక్తిని పొందిన అదృష్టం నాకే.. దేవుడి దయతో.. ప్రపంచం అలాగే మా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎప్పటికీ మాపై ఉంటుంది.. ఎట్టకేలకు ఎంతో అదృష్టం చేసుకున్నాను అంటూ ఒక ఫోటోతో పాటు పోస్టును కూడా షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా నెట్టింట బాగా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news