సోనియా గాంధీకి మరిన్ని పరాభవాలు తప్పవు : విజయసాయి

-

సీఎం జగన్‌.. నిత్యం ప్రకాశించే సూర్యుడు అని వైసీపీ నేత, రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. పొత్తు కోసం పొర్లుదండాలు పెట్టినా కనికరించని బీజీపీ 4 రాష్ట్రాల్లో గెలిస్తే, మీరు కలత చెందాలి గాని, జగన్ గారికెందుకు టెన్షన్ బాబూ? అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. ఎవరో ఒకరితో ‘అచ్చికబుచ్చిక’ లేకపోతే మీకు బతుకే లేదని.. మండి పడ్డారు. సీఎం జగన్ మోహన్‌ గారికి ఆ అవసరం లేదని… స్వయం ప్రకాశిత సూర్యుడిలాంటి వారాయన. ప్రజలే ఆయన సర్వస్వం అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్ పార్టీది గతించిన వైభవమని…. తనను ఎదిరించారన్న కారణంతో జగన్ గారిని అన్యాయంగా 16 నెలలు జైలు పాలు చేసింది సోనియా గాంధీ అంటూ నిప్పులు చెరిగారు. ఇంకా దారుణ పరాభవాలు ఎదుర్కొంటారు ఆమె. సోనియాకు పెద్ద పాలేరులా నిలిచిన చంద్రబాబు గారి పార్టీ ఇప్పటికే కుంటి గుర్రం అయింది. 2024లో కథ ముగుస్తుందంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “మోసకారి బడ్జెట్ అంటూ ‘వీరంగం’ చేస్తున్నాడు మాలోకం. మహామోసకారి ఎవరో గూగుల్ లో కొట్టి చూడు. మీ తండ్రి పేరే కనిపిస్తుంది. అమ్మఒడి, వాహనమిత్ర, విద్యాదీవెన లబ్దిదారులను ఎప్పుడైనా కలిశావా చిట్టినాయుడూ? ” అంటూ చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news