BIG BREAKING : ప్రధాని మోడీతో విజయసాయిరెడ్డి భేటీ..

-

వైసిపి కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి.. ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన విజయసాయిరెడ్డి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలపై ఆయనతో చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమస్యలు, పోలవరం పెండింగ్ నిధులు, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధాని నరేంద్ర మోడీతో విజయసాయిరెడ్డి చర్చించారు.

అయితే ఈ సమావేశం అనంతరం రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను తాను వివరించారని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కోరానని అని తెలిపారు. తమ డిమాండ్ల పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారని వెల్లడించారు. కాగా నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో విజయ సాయి రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆయన తో  కూడా… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news