బెజవాడ టీడీపీలో ఆగని పోరు..రంగంలోకి బాబు..!

-

విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో కొనసాగుతుంది..చాలా రోజుల నుంచి ఇక్కడ కొందరు టీడీపీ నేతల మధ్య పోరు తారస్థాయిలో నడుస్తోంది. ఎంపీ కేశినేని నాని వరుసపెట్టి కొందరు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా..ఆఖరికి తన సోదరుడు కేశినేని శివనాథ్ టార్గెట్ గా కూడా ఫైర్ అవుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో తన సోదరుడుకు సీటు ఇస్తే తాను ఎట్టి పరిస్తితులోనూ సహకరించనని అన్నారు. మిగిలిన ముగ్గురికి సీట్లు ఇచ్చిన సహకరించనని అన్నారు.

కాల్ మనీ నేరగాళ్ళు, సెక్స్ రాకెట్, రియల్ దందాలు చేసేవారికి సపోర్ట్ చేయనని చెప్పుకొచ్చారు. అవసరమైతే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కేశినేని అంటున్నారు. ఇక పార్టీ ప్రక్షాళన జరగాలని, పార్టీని అమ్ముకున్న వారు వద్దు అంటూ కేశినేని ఫైర్ అవుతున్నారు. ఇక కేశినేని కామెంట్స్ పై బుద్దా, శివనాథ్ సైతం స్పందించారు. కానీ వారు రివర్స్ లో కౌంటర్లు వేయలేదు. చంద్రబాబు ఎవరికి సీటు ఇస్తే వారికి సపోర్ట్ చేస్తామని అన్నారు.

బెజవాడలో టీడీపీ నేతల ట్విట్టర్ వార్ | TV9 Telugu

కేశినేని నానికి సీటు ఇస్తే..ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని చెబుతున్నారు. తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నాననే తప్ప..ఎప్పుడు సీటు అడగలేదని కేశినేని శివనాథ్ అంటున్నారు. అయితే ఈ గ్రూపు పరోక్షంగా కేశినేని నానికి సీటు రాకుండా చేయాలని చూస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే కేశినేని రివర్ అయ్యి..వారిపైనే విరుచుకుపడుతున్నారు.

అయితే ఇలాగే బెజవాడలో రచ్చ జరిగితే టీడీపీకి నష్టం..అందుకే ఈ పోరుకు చెక్ పెట్టడానికి బాబు రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది. నేతలని పిలిచి క్లాస్ పీకనున్నారని సమాచారం. మరి అప్పుడైనా నేతల్లో మార్పు వస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news