విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

-

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే లో సొంత గడ్డపై 5 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు విరాట్ కోహ్లీ. వెస్టిండీస్ తో నిన్న జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో 8 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ… ఐదు వేల పరుగుల మార్కును దాటాడు. తద్వారా ఈ రికార్డు నెలకొల్పిన నాలుగో బ్యాట్స్మన్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. రన్నింగ్ మిషన్ సచిన్ టెండూల్కర్ 48 సగటుతో 6975 పరుగులు చేశాడు. ఆ తర్వాత రికీపాంటింగ్ 39 సగటుతో 5521 పరుగులు చేశారు. ఆటో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ కలిసి 5180 ఆరు పరుగులు చేశాడు.

ఇక విరాట్ కోహ్లీ యావరేజ్ ప్రకారం (60.17) అగ్రస్థానంలో నిలిచాడు. ఇక సొంతగడ్డపై అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. గ్రాండ్ కోహ్లీ కేవలం 99 మ్యాచ్లోనే 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news