అమెరికాలో కాల్పులు.. విశాఖ జిల్లా వాసి మృతి

-

అగ్ర‌రాజ్య‌మైటువంటి అమెరికాలో మ‌రొక‌సారి కాల్పుల మోత మోగింది. అలాబామా రాష్ట్రంలో ఓ దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాకు చెందిన ఓ యువ‌కుడు చిట్టూరి స‌త్య‌కృష్ణ (27) మృతి చెందారు. పాత బ‌ర్మింగ్ హోంలోని ఓ స్టోర్‌లో క్ల‌ర్క్‌గా ప‌ని చేస్తోన్న స‌త్య‌కృష్ణ నెల రోజుల క్రిత‌మే ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

కాల్పులు ఎందుకోసం చేశార‌నేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఏపీకి చెందిన స‌త్య‌కృష్ణ మృతి వార్త తెలియ‌గానే ఆయ‌న కుటుంబ స‌భ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువ‌కుడి మృత‌దేహాన్ని స్వ‌దేశానికి తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వం సాయం చేయాల‌ని కోరుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయ‌కులు విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి కూడా ఈ ఘ‌ట‌న‌పై ట్విట‌ర్ వేదికగా స్పందించారు. స‌త్య‌కృష్ణ మృతి విచాక‌ర‌మ‌న్న ఆయ‌న అత‌ని కుటుంబానికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌గు సాయం అందించాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్‌ను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news