మోదీ, అమిత్ షాలకు పవన్ కల్యాణ్ వెదవ వేషాలు తెలుసు – వెల్లంపల్లి

-

నరేంద్ర మోదీ, అమిత్ షాలకు పవన్ కల్యాణ్ వెదవ వేషాలు తెలుసు అని విమర్శలు చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. బీజేపీ వాళ్లు పవన్ కల్యాణ్‌ని పట్టించుకోవడం లేదు. పవన్ మాత్రం బీజేపీ భజన చేస్తున్నాడని..చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ తీసుకొని పవన్ కల్యాణ్ బీజేపీతో టచ్‌లో ఉన్నాడని మండిపడ్డారు.

బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ రాష్ట్ర సంక్షేమం కోసం ఒక్కరోజైనా పని చేశారా ? అని నిలదీశారు. మొట్ట మొదట అమిత్ షా అపాయింట్‌మెంట్‌ తీసుకొని పవన్ కల్యాణ్ మాట్లాడాలి.. పవన్ కల్యాణ్ మాటలోడే తప్ప చేతలోడు కాదని ఎద్దేవా చేశారు. చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం జనసేనకి సపోర్ట్ చేయాలని నాగబాబు చెప్పడం.. చిరంజీవిని అవమానించటమే అని మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్.  పవన్‌ కల్యాణ్‌ ఆంధ్ర రాష్ట్రానికి పనికిరాడు.. మెగాస్టార్‌ లేనిదే.. పవర్‌స్టార్‌ ఎక్కడ? అని ప్రశ్నించారు వెల్లంపల్లి శ్రీనివాస్. చిరంజీవి లేకుండా పవన్‌ కల్యాణ్‌ ఎవరికి తెలుసు? అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news