నిరుద్యోగులకు అండగా ఉంటాం: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

-

తెలంగాణాలో నిరుద్యోగుల సభ జరగనుంది.. ఈ నెల ఎనిమిదవ తేదీన కాంగ్రెస్ మహిళానేత ప్రియాంక గాంధీ అధ్యక్షతన ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభ గురించి కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ విధంగా మాట్లాడారు. ప్రభాకర్ మాట్లాడుతూ ఈ సభను సరూర్ నగర్ లో నిర్వహిస్తున్నాము. ప్రియాంక గాంధీ ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం.. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అండగా ఉండడమే అని పొన్నం తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము అయ్యాక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనుకున్నాం. కానీ ఖాళీలు ఉన్నా ఎందుకో నోటిఫికేషన్ లు వదలకుండా కేసీఆర్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు.

ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎందరో నిరుద్యోగులు రోడ్డున పడ్డారు అంటూ మండిపడ్డారు. మరి నిరుద్యోగుల కోసమే జరగనున్న ఈ సభ ఏ మేరకు ప్రయోజనంగా మారుతుందో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news