చంద్రబాబు వెన్నుపోటు విషయంలో బాలయ్య స్పందన ఏమిటంటే..?

-

స్వర్గీయ నందమూరి తారక రామారావును.. చంద్రబాబు టీడీపీ పార్టీ కోసం వెన్నుపోటు పొడిచారు అని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలలో చాలామంది భావిస్తారు. ఇక చంద్రబాబు వెన్నుపోటు విషయంలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఆహ ఓటిటిలో జరిగిన అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు నారా లోకేష్ హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా 1995 వ సంవత్సరంలో ఎదురైనా పరిస్థితులకు సంబంధించి చంద్రబాబు అలాగే బాలయ్య కీలక విషయాలు వెల్లడించారు. తీసుకున్న నిర్ణయం అతిపెద్ద నిర్ణయం అని చంద్రబాబు తెలిపారు.

సీనియర్ ఎన్టీఆర్ ఒక ఆశయం కోసం పార్టీ పెట్టి పోరాడారు .. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ఆయన భావించారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక 1995లో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు అని , ఆ నిర్ణయం వెనుకాల సాక్ష్యం 5 మంది అని చంద్రబాబు చెప్పగా.. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది బావా అని కూడా బాలయ్య కామెంట్లు చేశారు.. బాలయ్య మాట్లాడుతూ.. ఆరోజు నేను, మీరు, హరికృష్ణ అన్నయ్య , బివి మోహన్ రెడ్డి గారు నాన్నగారి దగ్గరకు వెళ్ళామని బాలయ్య చెప్పుకొచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత రాజకీయ విషయం అయితే నేను మాత్రమే మాట్లాడాలని చెప్పి మిగతా వారందరిని బయటకు పంపించారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

మూడు గంటల పాటు అన్ని వివరించి మీటింగ్ కూడా పెట్టాలని , ఎమ్మెల్యేలను కన్సోల్ చేస్తే చాలని సీనియర్ ఎన్టీఆర్ కి చెప్పానని చంద్రబాబు తెలిపారు. రాముడు ఆంజనేయ స్వామి మధ్య రామాంజనేయ యుద్ధం జరిగిందని, ఆరోజు నిర్ణయం అనేది సీనియర్ ఎన్టీఆర్ కంటే ఆయన సిద్ధాంతాలను కాపాడాలని తీసుకున్న నిర్ణయమేనని చంద్రబాబు తెలిపారు. అంతేకాదు అందుకు బాలయ్య బాబు సాక్ష్యం అని కూడా తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ తో ప్రయత్నాలు ఫెయిల్ కావడం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నామని, ఆరోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా చంద్రబాబు వేసిన ప్రశ్నకు బాలయ్య స్పందిస్తూ.. నాన్నకు నాయకుడిగా కంటే పర్సనల్ ఎమోషన్ ఆ సమయంలో పెరిగిపోయింది. ఆయన ఇష్టాన్ని మనం ఎప్పుడు కాదనలేదు. ఆ సమయంలో నాన్న ఒక కన్ఫ్యూజన్లో పడ్డారు. ఆరోజు మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నందమూరి కుటుంబ సభ్యుడిగా నేను చెబుతున్నాను అంటూ బాలయ్య క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news