వైయస్సార్ చనిపోయినప్పుడు కొడాలి నాని ఏం చేశారో త్వరలోనే బయట పెడతా – బుద్ధా వెంకన్న

-

వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిపై టిడిపి సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. ఆనాడు హరికృష్ణ ఎన్నికలలో ఓడిపోవడానికి కొడాలి నానే కారణమని ఆరోపించారు. వైయస్సార్ చనిపోయినప్పుడు కొడాలి నాని, మిగతావాళ్లు అంతా ఏం చేశారో త్వరలోనే బయట పెడతానని అన్నారు. చంద్రబాబుపై కొడాలి నాని అనవసర విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.

లేకపోతే కొడాలి నానిని పోస్టుమార్టం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కొడాలి నాని కుక్క తోలు కప్పుకున్న గుంటనక్క అని, శకుని అని విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన తనపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరికృష్ణ పేరు వాడుకొని నాని బతుకుతున్నాడని.. వైయస్సార్, హరికృష్ణ లలో ఎవరు గొప్ప అంటే నాని ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నాని లాంటివారు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి కీడు తప్ప మేలు జరగదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version