స్టార్ హీరోయిన్స్ ను వివాహం చేసుకున్న దర్శకులు ఎవరంటే..?

-

ప్రేమ అనేది ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా పుడుతుందో తెలియదు.. కాబట్టి సినీ తారలు తమ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటారు. అందులో కొంతమంది హీరోలను వివాహం చేసుకుంటే మరి కొంతమంది డైరెక్టర్లను , నిర్మాతలను , ఆర్ట్ డైరెక్టర్లను ఇలా తమ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఇక మరి కొంతమంది క్రికెటర్లను లేదా బయట వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ చాలామంది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఇటీవల కాలంలో ఎక్కువగా డైరెక్టర్లను హీరోయిన్లు వివాహం చేసుకుంటూ ఉండడం గమనార్హం. అంతేకాదు ఆ దర్శకుల డైరెక్షన్ లో ఎన్నో సినిమాలను కూడా తెరకెక్కించడం జరిగినది. మరి ఆ డైరెక్టర్లను వివాహం చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

రమ్యకృష్ణ – కృష్ణవంశీ:

స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ, డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చంద్రలేఖ సినిమాలో నటించింది .వీరిద్దరి మధ్య ఆ సినిమాతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.

సుహాసిని – మణిరత్నం:


స్టార్ హీరోయిన్ సుహాసిని కూడా కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం ను వివాహం చేసుకున్నారు ..ఇక మణిరత్నం డైరెక్షన్ లో కూడా సుహాసిని ఎన్నో చిత్రాలలో నటించింది.

రోజా – సెల్వమని:

ప్రముఖ స్టార్ హీరోయిన్ రోజాను ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వమని ప్రేమించే వివాహం చేసుకున్నారు. సెల్వమణి దర్శకత్వంలో రోజా ఎన్నో చిత్రాలలో నటించింది. రోజా తెలుగమ్మాయి కావడం సెల్వమని పక్క తమిళీయన్ కావడం గమనార్హం.

ఖుష్బూ – సుందర్ :


వెంకటేష్ తో జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రామానాయుడు నిర్మాణ సారథ్యంలో మొదటిసారి కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా ఖుష్బూ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ సుందర్ ను వివాహం చేసుకుంది.

నయనతార – విఘ్నేష్ శివన్:

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార జూన్ 9వ తేదీన అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. ఇకపోతే లేడీ సూపర్ స్టార్ నయనతార , విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఎన్నో సినిమాలలో నటించి.. ప్రేమించి..వివాహం చేసుకుంది.ఇక విరే కాకుండా మరికొంతమంది ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version