బండి సంజయ్ చేతిలో బిజెపి పార్టీ..పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: వైయస్ షర్మిల

-

బిజెపి పార్టీ, బండి సంజయ్ పై వైఎస్ఆర్ సీపీ చీఫ్ వైయస్ షర్మిల మండిపడ్డారు. బిజెపి పార్టీ మత రాజకీయాలు చేస్తుందని, మసీదులను కూలగొడతామని బండి సంజయ్ మాట్లాడుతున్నారని అన్నారు. శవాలు ఉంటే ముస్లింలవి అంటా.. శివుడు ఉంటే హిందువులవి అంటూ.. ఉర్దూ భాష కూడా లేకుండా చేస్తారని దారుణంగా మాట్లాడారు అని పేర్కొన్నారు. ఇలా మాట్లాడుతూ ఉంటే కనీస చర్యలు కూడా తీసుకోలేదు అని అన్నారు.

Sharmila
Sharmila

బండి సంజయ్ చేతిలో బీజేపీ పార్టీ.. పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టుగానే ఉన్నది అని వివరించారు. రాష్ట్రంలో అగ్గిపెట్టి చలి కాచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారని, వారికి ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన వాడ్లను కొన్నారా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారా? ఎందుకు బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని నిలదీశారు. తాము అన్ని వర్గాలకు అండగా నిలబడతామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news