కెసిఆర్ నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటున్నాడు: ఈటెల రాజేందర్

-

ప్రస్తుతం తెలంగాణలో సాగుతున్నది ప్రజా కంటక, ప్రజా వ్యతిరేక పాలనేనని, దానిపై బిజెపి కొట్లాడుతుంది అని మాజీ మంత్రి,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణలో నేనే రాజు, నేనే మంత్రి అని సీఎం అనుకుంటున్నాడని.. తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని టీఆర్ఎస్,కెసిఆర్ భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ తరహా పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరాల్సిందేనని ఈటెల అన్నారు.

 

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానేనని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పైన ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ దీపం ఢిల్లీలోనే ఆరిపోయింది అన్న ఈటెల.. తెలంగాణలో హస్తం పార్టీ గెలిచే అవకాశమే లేదని తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు పరాజయం తప్పదన్నారు ఈటెల.

Read more RELATED
Recommended to you

Latest news