వైసీపీ పార్టీలో మరో విషాదం..కీలక నేత మృతి

-

వైసీపీ పార్టీలో మరో విషాదం చోటు చేసుకుంది. వైసీపీ పార్టీలో కీలక నేత మృతి చెందారు. తిరుపతి పూతలపట్టు-నాయుడుపే ట జాతీయ రహదారి మర్రి గుంట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వెంకటగిరి జెడ్పిటిసి, వైఎస్సార్ సీపీ నాయకులు కోలా వెంకటేశ్వర్లు మృతి చెందారు.

ఆయన కారు ఇనుప లోడు లారీని ఢీ కొట్టింది. వెంకటేశ్వర్లు తిరుపతి నుంచి వెంకటగిరి వెళ్తుండగా రేణిగుంట యోగానంద కాలేజీ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా, అదే కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాజుల మండ్యం పోలీసులు హుటా హుటీనా సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news