ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. నేడు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల పంపిణీ

-

అమరావతి : ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నేడు వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం – ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్ల మెగా పంపిణీ ప్రారంభం కానుంది. గుంటూరులో రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీని జెండా ఊపి ప్రారంభించనున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. ఇప్పటి వరకు 6,781 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్ధాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లకు యంత్ర పరికరాల పంపిణీ చేశారు.

రూ. 691 కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేసిన జగన్ సర్కార్… వ్యవసాయ పని ముట్ల కోసం 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ. 175.61 కోట్ల సబ్సిడీ జమ చేసింది ప్రభుత్వం. ఇక ఇందులో భాగంగానే గుంటూరు, పల్నాడు జిల్లాలలో సీఎం జగన్ పర్యటన చేయనున్నారు.

ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరి, 10.40 గంటలకు గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో సభా వేదిక వద్దకు చేరుకోనున్న సీఎం. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లు, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా కొండవీడు చేరుకోనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.

Read more RELATED
Recommended to you

Latest news