మరో దారుణం.. విదేశీ మహిళపై అత్యాచారం..

-

సంస్కృతి సంప్రదాయాలకు కొలువైన భారతదేశంలో అత్యాచారాలు పరంపరం కొనసాగుతోంది. దేశంలో మహిళలు, యువతులు, చిన్నారు ఆఖరికి రేపో మాపో చనిపోయే ముసలి వాళ్లను కూడా కామాంధులు వదిలిపెట్టడం లేదు. అయితే తాజాగా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారతదేశంలో సరదగా గడుపుదామని భర్తతో కలిసి వచ్చి విదేశీ మహిళపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన గోవాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోవాలో స్థానికులు, మరీ ముఖ్యంగా కూలి పని చేసే వారు కూడా ఆంగ్లం సరళంగా మాట్లాడటమే అక్కడికి విదేశస్తుల తాకిడిని వెల్లడిస్తుంది. గోవా బీచ్‌లలో ఎప్పుడూ విదేశీయులు రిలాక్స్ అవుతున్న దృశ్యాలు సర్వసాధారణం.

Bournemouth beach rape: Suspect named in hunt for Dorset sex offender | UK  | News | Express.co.uk

అయితే, ఓ దుండగుడు దీన్నే ఆసరాగా తీసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తర గోవాలో ప్రసిద్ధ స్వీట్ లేక్ సమీపంలోని ఆరంబోల్ బీచ్‌లో విదేశస్తురాలిపై అత్యాచారం జరిగింది. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళపై 32 ఏళ్ల దుండగుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. బ్రిటన్‌కు చెందిన ఆ మహిళ భర్తతో కలిసి గోవాకు వచ్చింది. గోవాలో వారు సరదాగా కాలం గడుపుతున్నారు. జూన్ 2వ తేదీన ఆమె ఆరంబోల్ బీచ్‌లో రిలాక్స్ అవుతుండగా.. గోవాకు చెందిన జోయల్ విన్సెంట్ డిసౌజా ఆమెపై కన్నేశాడు. భర్త లేనిది చూసి ఒంటరిగా ఉన్న ఆమెను బలత్కరించాడు. ఈ అఘాయిత్యం గురించి ఆమె తన భర్తకు తెలిపింది. ఇద్దరు కలిసి పోలీసులను ఆశ్రయించారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు జోయల్ విన్సెంట్ డిసౌజాను పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news