చైనాలో లాంచ్‌ అయిన Oppo A 57 5G స్మార్ట్‌ ఫోన్..!

-

Oppo నుంచి A57 5జీ స్మార్ట్ ఫోన్‌ చైనాలో విడుదలైంది. ధర 20వేలకు పైగానే ఉంది. ఫీచర్స్‌ కూడా ఇందులో బానే ఉన్నాయి. ఈ మిడ్ రేంజ్ 5జీ ఫోన్‌లో డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఒప్పో ఏ97 5జీ ధర..

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది.
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర 1,999 యువాన్లుగా అంటే.. సుమారు రూ.23,600గా నిర్ణయించారు.
బ్లాక్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
 ఈ ఫోన్ మనదేశంలో కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఒప్పో ఏ97 5జీ స్పెసిఫికేషన్లు..

ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
12 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉంది.
మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ, వైఫై, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ వీ5.3, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news