ఆడపిల్లల తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్..ఏడాదికి లక్ష పొందవచ్చు..

-

ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..అందులో సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఒకటి.ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆ పథకం గురించి వివరాలను ఓ సారి తెలుసుకుందాం. ఆర్థిక సమానత్వ స్థిరత్వం సాధించడం మహిళలకు చాలా అవసరం. కాబట్టి మహిళలకు ఆర్థికపరంగా ఊతమిచ్చేలా ఈ పథకం అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ పథకంలో పెట్టుబడి పెడితే కచ్చితంగా ఉన్నత చదువు సమయంలో ఉపయోగపడుతుంది..

బ్యాంకులు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్‌లో పొదుపు ఖాతను తెరవవచ్చు. ఎస్ఎస్‌వై ఖాతాలకు 7.6 శాతం వడ్డీ వస్తుంది. మీరు మీ పెట్టుబడి, వ్యవధి ఆధారంగా మీ లాభన్ని తెలుసుకోవచ్చు..

సుకన్య సమృద్ధి యోజన పథకం పూర్తి వివరాలు..

*. ఈ పథకాన్ని ఓపెన్ చెయ్యాలంటే భారతపౌరురాలు అయ్యి ఉండాలి..

*. అకౌంట్ ను ఓపెన్ చేసే సమయానికి అమ్మాయి వయస్సు పదేళ్లకు మించి ఉండరాదు..

*. సుకన్య సమృద్ధి యోజన ఖాతా కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే తెరుస్తారు..

ఇకపోతే ఈ పథకంలో ఓ ఖాతాదారుడు అర్హులై ఉంటే.. ఆడపిల్ల వయస్సుతో పాటు పెట్టిన పెట్టుబడి ఆధారంగా రాబడి ఉంటుంది. సుకన్య పథకంలో అకౌంట్ తీసుకోవాలంటే కనీస మొత్తం రూ.250తో ఖాతా ప్రారంభించాలి. గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ ఈ ఖాతా దాచుకోవచ్చు. ఉదాహరణకు మీరు పది సంత్సరాల కాలనికి 7.6 శాతం వడ్డీరేటుతో నెలకు రూ.8333 పెట్టుబడి పెడితే అది సంవత్సరానికి రూ. లక్ష అవుతంది. అయితే మెచ్యూర్ అయ్యాక వడ్డీతో కలిపి రూ.15,29,458 లాభాన్ని మీరు పొందవచ్చు.. ఇప్పటివరకు ఖాతాను తెరవని వాళ్ళు ఇప్పుడే ఓపెన్ చేసి మంచి లాభాలను పొందండి..

Read more RELATED
Recommended to you

Latest news