మీ ఆధార్ తో పాన్ లింక్ అయ్యిందా?.. ఇలా చెక్ చేసుకోండి..

-

మనకు ఇప్పుడున్న అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కూడా ఒకటి.. అందుకే ప్రతి డానికి అనుసంధానం చెయ్యాలని ప్రభుత్వం కోరుతుంది.. చదువుల దగ్గరి నుంచి రేషన్ వరకు అన్ని కూడా ఆధార్ పై ఆధారపడుతున్నాయి. ఇక ఆధార్ తో పాన్ లింక్ చేసుకోవాలని కేంద్రం ఎప్పటి నుంచో చెబుతుంది.. అయినప్పటికీ.. చాలా మంది దానిపట్ల నిర్లక్ష్యం చేశారు. తొలుత ఆధార్ తో పాన్ లింక్ చేయడం పూర్తిగా ఉచితంగా ఇచ్చిన కేంద్రం.. ఇంకా చాలామంది అనుసంధానించుకోవాల్సి ఉండటంతో.. ఇప్పుడు రూ.1000 రుసుము పెట్టింది.

ఉచితంగా ఇచ్చినపుడు పెద్దగా పట్టించుకోక పోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.ఇక ఇప్పటివరకు కేంద్రం 61కోట్ల మందికి పాన్ కార్డులను విడుదల చేయగా.. 48 కోట్ల మంది ఆధార్ తో పాన్ ను లింక్ చేసుకున్నారు. ఇంకా 13 కోట్ల మంది ఆధార్ తో లింక్ చేసుకోలేదని తెలుస్తోంది. ఇప్పుడు రూ.1,000 చెల్లించి మార్చి 31 వరకు లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఆధార్-పాన్ అనుసంధానించు కోకపోతే మార్చి 31 తర్వాతి రోజు నుంచి పాన్ డీయాక్టివేట్ అయిపోతుంది.

అసలు పాన్ నంబర్ పోతే.. పెట్టుబడులు, ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను చేసుకునే వీలుండదు. జీఎస్టీ రిటర్న్ దాఖలు చేసే అవకాశం కూడా ఉండదు..అందుకే మార్చి 31 వరకు ఆధార్ తో పాన్ లింక్ చేసుకోవాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి కోరుతోంది. మీ ఆధార్ పాన్ తో లింక్ అయిందో లేదో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు… కింద ఇచ్చిన లింక్ తో పూర్తి సమాచారన్ని పొందవచ్చు..

https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar..

Read more RELATED
Recommended to you

Latest news