సూపర్ స్కీమ్..నెలకు రూ.500 కట్టండి.. రూ.2,50,000 పొందండి..ఎలాగంటే?

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నెన్నో స్కీమ్ లను అందిస్తుంది..జీవితం సేవింగ్ అనేది ఉండాలి.. చిన్న మొత్తాల పొదుపుతో పెద్ద లాభాలను పొందవచ్చు.. మీ ఆదాయం తక్కువగా ఉందా? అయితే చిన్న మొత్తంతోనే ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించొచ్చు. చిన్న మొత్తంలో అయినా సరే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం పొందొచ్చు. ఇప్పుడు మనం నెలకు రూ. 500 పొదుపుతో మెచ్యూరిటీ సయమంలో రూ. 2.5 లక్షలు ఎలా పొందొచ్చొ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది ఒకటి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.

పదేళ్ల లోపు వయసు కలిగిన ఆడ పిల్లలు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. కేవలం రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు మొత్తాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు..అయితే మీరు నెలకు రూ. 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పటి నుంచి రూ. 500 పెడితే మెచ్యూరిటీలో రూ. లక్షలు పొందొచ్చు. సుకన్య సమృద్ధి పథకంలో చేరిన వారు 15 ఏళ్ల వరకు డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేటు త్రైమాసికం చొప్పున మారుతూ ఉండొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. కేంద్రం వడ్డీ రేటును సమీక్షిస్తుంది..

ఏడాదికి రూ. 6 వేలు డిపాజిట్ చేసినట్లు అవుతుంది. అంటే 15 ఏళ్లలో చూస్తే.. మీరు రూ. 90 వేల వరకు ఇన్వెస్ట్ చేసిన వారు అవుతారు. 15 నుంచి 21 ఏళ్ల వరకు మీరు డబ్బులు చెల్లించాల్సిన పని లేదు.

అయితే వడ్డీ మాత్రం వస్తూ ఉంటుంది. అంటే అప్పుడు మీకు వడ్డీ రూపంలో రూ. 1,64,606 వస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 90 వేలు. ఈ రెండింటినీ కలిపితే రూ. 2.54 లక్షలు అవుతాయి. అంటే మీకు మెచ్యూరిటీలో రూ. 2.5 లక్షలకు పైగా వస్తాయని చెప్పుకోవచ్చు. అందువల్ల మీకు పాప ఉంటే.. సుకన్య స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి..80సి కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news